శ్రీ లక్ష్మీ నారాయణ టెంపుల్ నూతన చైర్మన్ గా సందుర్వార్ హనుమాన్లు

– పాత కమిటీ రద్దు నూతన కమిటీ ఎన్నిక

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ టెంపుల్ నూతన చైర్మన్గా సందూర్ వార్ హనుమాన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఆలయ పాత కమిటీ నీ గ్రామస్తులు ఏకగ్రీవంగా రద్దు చేస్తూ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పాత కమిటీ రద్దు కావడం నూతన కమిటీ నీ అయిదుగురు సభ్యులతో ఎన్నుకున్నారు. చైర్మన్గా సందుర్ వార్ హనుమాన్లు ,వైస్ చైర్మన్ గా బండి వార్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా కంచిన్వార్ రవి, కోశాధికారిగా కంచినివార్ నాగేష్, కమిటీ సభ్యులుగా బండి వార్ అనిల్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో రాబోయే లక్ష్మి నారాయణ్రథోత్సవాలు జరగనున్నాయి. గల్లి వాసులు గ్రామస్తులు లక్ష్మి నారాయణ రథోత్సవాల వేడుకలు విజయవంతనికి సహకరించాలని నూతన కమిటీ సభ్యులు కోరారు.
Spread the love