సత్య నాదెళ్లకు రూ.2 లక్షల జరిమానా

నవతెలంగాణ – హైదరాబాద్; కంపెనీల చట్టం-2013లోని సిగ్నిఫికెంట్ బెనిఫిషియల్ ఓనర్ (ఎస్‌బీవో) నిబంధనలను మైక్రోసాఫ్ట్ సారధ్యంలోని ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ ‘లింక్డ్‌ఇన్ ఇండియా’ ఉల్లంఘించింది. కంపెనీకి సంబంధించి ముఖ్య ప్రయోజన యాజమానిని (ఎస్‌బీవో) గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవడంలో కంపెనీ విఫలమైంది. ఈ మేరకు చట్టంలోని సెక్షన్ 90(1) ప్రకారం నివేదించడంలో కంపెనీ సహా, కీలక స్థానాల్లో ఉన్న పలువురు అధికారులు విఫలమయ్యారు. దీంతో మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల సహా 8 మంది వ్యక్తులకు భారత ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున జరిమానా విధించింది. లింక్డ్‌ఇన్ కంపెనీకి రూ.7 లక్షలు పెనాల్టీ విధించింది. మొత్తం రూ.27,10,800 మొత్తాన్ని జరిమానాగా విధించింది.

Spread the love