నవతెలంగాణ-ఎల్కతుర్తి
మండలం లోని బావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఆదివారం బడి బాట కార్యక్రమంలో భాగంగా ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వ హించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తు న్నామని, 1 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు ఇంగ్లీషు లో బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల, యూనిఫామ్, పౌష్టి కాహారం, తదితర అనేక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధా నోపాధ్యాయులు ఎల్ మనోహర్ నాయక్,పి.రాజేందర్ రెడ్డి, ఉపాద్యాయులు వాసంతి, ప్రసూన,సునీత,రవికుమార్ ,అంగన్వాడీ టీచర్ సరితా పాల్గొన్నారు.