నవతెలంగాణ హైదరాబాద్: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో 94.15 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 11 డివిజన్లలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరిగింది. 13 కార్మిక సంఘాలు బరిలో ఉండగా.. సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. 11 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.