నవతెలంగాణ దుబ్బాక రూరల్: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభుని పల్లి గ్రామానికి చెందిన నూతన మహిళ ఓటర్లు, యువతులు గురువారం దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొని తొలిసారి ఓటేసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు తొలిసారి ఓటు వేసిన అనుభూతినీ మీడియాతో వ్యక్తం పరిచారు.