వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం..

– ఉత్సవాల్లో పాల్గొని దర్శించుకున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి 

నవతెలంగాణ – బెజ్జంకి 
మండల పరిధిలోని అయా గ్రామాల్లో శ్రీరామ నవమి పండుగ వేడుకలను ప్రజలు బుధవారం వైభవంగా నిర్వహించుకున్నారు. మండలంలోని చీలాపూర్,లక్ష్మీపూర్ గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల అవరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో హజరై దర్శించుకున్నారు. అనంతరం అయా గ్రామాల ఉత్సవ నిర్వహాకులు ఎమ్మెల్యేను శాలువ కప్పి సన్మానించారు. అంతకుముందు మండల కేంద్రంలోని పెద్దమ్మ దేవాలయాన్ని ఎమ్మెల్యే సందర్శించి పూజలు చేశారు. నాయకులు రత్నాకర్ రెడ్డి,దామోదర్,అక్కరవేణీ పోచయ్య,పులి క్రిష్ణ, శానగొండ శ్రవణ్,శరత్,శ్రీనివాస్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,రొడ్డ మల్లేశం,జెల్లా ప్రభాకర్,అయా గ్రామాల నాయకులు రామకృష్ణ రెడ్డి,కొమ్ము రవి తదితరులు పాల్గొన్నారు.
ముస్లీం సోదరుల విజ్ఞప్తి..
లక్ష్మిపూర్ గ్రామంలోని లింగేశ్వర స్థిర ఆలయాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సందర్శించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని ముస్లీం సోదరులు ఎమ్మెల్యేను కలిసి మండల కేంద్రంలో ఈద్గా, ఖబరిస్తాన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రమందజేశారు.
ఒడిబియ్యం ఘట్టంలో తన్నీరు శరత్ రావు..
వడ్లూర్ గ్రామంలో శ్రీ రామ నవమి సందర్భంగా నిర్వహించిన చిరుతల రామాయణం ముగింపు కార్యక్రమానికి పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావు హజరయ్యారు.గ్రామస్తులు సమర్పించిన ఒడిబియ్యం ఘట్టంలో పాల్గొన్నారు.
దాచారం, తోటపల్లిలో..
దాచారం,తోటపల్లి గ్రామాల్లోని రామాలయాల్లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. దాచారంలో ఎంపీటీసీ కొలిపాక రాజు అధ్వర్యంలో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. జెడ్పీటీసీ కనగండ్ల కవిత,అయా గ్రామాల మాజీ సర్పంచుల దంపతులు,గ్రామస్తులు హజరై ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు.
Spread the love