బీఆర్ఎస్ కు మరోషాక్..కాంగ్రెస్ లో చేరిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా

నవతెలంగాణ-హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ , సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, ఐవీఎఫ్ ఆలిండియా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం కాంగ్రెస్​లో చేరారు. రోడ్​ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, తెలంగాణ పీసీసీ జనరల్ సెక్రెటరీ కుమార్ రావుల ఆధ్వర్యంలో ఆలిండియా జాతీయ కాంగ్రెస్ పార్టీ(ఏఐసీసీ) జనరల్ సెక్రెటరీ రోహిత్ చౌదరి సమక్షంలో గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీనివాస్ గుప్తాకు వారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రోహిత్ చౌదరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.

Spread the love