నవతెలంగాణ-ఓయూ
మహిళా పొదుపు సంఘాల రుణం కోసం బ్యాంకర్లతో శుక్రవారం సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ సమావేశం ఏర్పాటు చేశారు. సీతాఫలమండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్ మహిళా పొదుపు సంఘాలు, కెనరా బ్యాంక్ ఖైరతాబాద్ బ్రాంచ్ వారితో సమావేశం అయ్యారు. మహిళా పొదుపు సంఘం సభ్యులకు దాదాపు 15 మహిళా గ్రూపులకు రుణాలు ఇప్పించేందుకు కార్పొరేటర్ బ్యాంకర్లతో మాట్లాడారు. త్వరలోనే రుణాలు మంజూరు చేస్తామని బ్యాంక్ అధికారులు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో యూసీడీ అధికారి ధనుశ్రీ, మహిళా పొదుపు సంఘాల సభ్యులు పాల్గొన్నారు.