రాష్ట్ర ముఖ్య సలహాదారు సోమేశ్‌ కుమార్‌ను కలిసిన ముజీబ్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌.ఎం.హుస్సేనీ (ముజీబ్‌) నూతనగా రాష్ట్ర ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన సోమేశ్‌ కుమార్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సోమేశ్‌ కుమార్‌కి శుభాకాంక్షలు తెలియచేస్తూ, రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీగా పని చేసిన అనుభవంతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తారని ఆశించారు. సోమేశ్‌ కుమార్‌ మాట్లడుతూ తాను చీఫ్‌ సెక్రెటరీగా ఉన్నప్పుడు ఉద్యోగులందరూ ఎల్లవేళలా తనకు సహకరించారనీ, ఇక ముందు కూడా అలాగే తన వెంట ఉండాలని కోరుతూ.. సంఘం చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు.

Spread the love