నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ 17వ సీజన్లో ఉప్పల్ స్టేడియం మరో మ్యాచ్కు వేదికగా నిలవనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్లోనూ విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. మరోవైపు గత రెండు మ్యాచుల్లో ఓడిన హైదరాబాద్ టాప్ -4 నుంచి కిందికి పడిపోయింది. ఇరు జట్ల మధ్య ఇవాళ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. కాగా కొద్దిసేపటి క్రితం టాస్ వేయగా సన్ రైజర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత రెండు మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలింగ్ తీసుకోవటంతో రెండు మ్యాచ్ లలో చేజింగ్ చేయడంతో విఫలం అవ్వడంతో ఒటమి పాలైంది. దీంతో ఇవాళ మ్యాచ్ లో హైదరాబాద్ కెఫ్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నేటి మ్యాచ్ లో భారీ స్కోరు సాధిస్తుందా లేదా చూడాలి.