రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం. ఎమ్మెల్యే సీతక్క

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలం లోని పస్ర, చల్వాయి గ్రామాల నుండి 80 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సోమవారం మండలంలోని పసర చల్వాయి గ్రామాల నుండి 80 మంది  కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారిని పార్టీ కండువాలు కప్పి సీతక్క సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గతంలో రెండు సార్లు టిఆర్ఎస్ పార్టీకి అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కుటుంబ పాలన సాగిస్తున్నారని అన్నారు. ఆ పార్టీని అందులో ఉండే వారే ఇప్పుడు చీత్కరించుకొనే పరిస్థితి తలెత్తిందని అన్నారు. ప్రజా సమస్యల్లో నిత్యం పోరాటం చేస్తూ, ప్రజల కష్టాలను తీర్చాలని ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా అధికార పార్టీపై పోరాటం చేస్తూనే ఉన్నానని, నిత్యం ప్రజా కష్టాల్లో ప్రజలకు అండగా నిలబడి కరోనా కాలంలో, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు సహాయం అందిస్తూ, ములుగు ప్రాంత సమస్యలపై పోరాడుతూనే ఉన్నానని అన్నారు. ప్రతి క్షణం కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం శ్రమిస్తూ ఉన్నానని, అలాగే ఇప్పుడు అధికార పార్టీలో ఉండి అత్యున్నత పదవులు పొందిన కూడా ప్రజల కష్టాలను పట్టించుకోలేదని, ఇప్పుడు ఎన్నికల సమయం రాగానే ఓట్ల కోసం నాటకాలాడుతు మోసం చెయ్యడానికి వస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో కానీ, వరదల సమయంలో కానీ, వడ్ల కొనుగోలు విషయంలో కానీ ఏ రోజు ప్రజల్లోకి రాని నేతలు ఈ రోజు వచ్చి ఓట్ల కోసం డ్రామాలాడుతున్నారని అన్నారు. పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, గృహలక్ష్మి పథకం కోసం అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇవ్వాలని అన్నారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం వల్ల వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం గద్దెనెక్కి రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ ఉచిత నిర్భంద విద్య, దళితులకు 3ఎకరాల భూమి ఇస్తా అని, అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని నమ్మించి మోసం చేశారని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు పేదలకు చేరువయ్యాయని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరా జల ప్రభ ద్వారా బోర్లు, పంట రుణాలు, లక్ష రూపాయల రుణమాఫి, ఫీజ్ రీ ఇంబార్సుమెంట్, ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్, ప్రాజెక్టులు, కల్వర్టులు, పాఠశాలలు, కళాశాలలు అన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి విచ్చేసిన వారికి అందరికీ నా తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పులుగుజ్జు వెంకన్న, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love