నవతెలంగాణ-తలకొండపల్లి
మండల పరిధిలోని వెల్జాల్, వెంకటరావుపేట గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన బ్యాగరి నరసింహ, పోలే యాదయ్య ఇంటి స్లాబ్ కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా సిమెంటు, సీకులను ఉప్పల చారిటబుల్ ట్రస్టు చైర్మన్, జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్ సోమవారం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లేకేడీ అంబాజీ, ఉపసర్పంచ్ అజీజ్, నాయకులు వద్దే రాజు తదితరులు పాల్గొన్నారు.