– అసోచామ్ స్టేట్ హెడ్ దినేష్ బాబు
హైదరాబాద్ : ప్రపంచ ఐపి దినోత్సవం సందర్భంగా టీ హబ్, రెసొల్యూట్4 ఐపీతో కలిసి అసోచామ్ ఓ ప్రత్యేక సెమినార్ను నిర్వహించింది. ఈ సందర్బంగా అసోచామ్ ఏపీ, తెలంగాణ హెడ్ మచ్చా దినేష్ బాబు మాట్లాడుతూ.. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు, స్థిరమైన అభివద్ధిని ప్రోత్సహించడానికి మేధో సంపత్తిని ప్రభావితం చేసే వినూత్న విధానాలు అవసరమన్నారు. ఈ సదస్సులో ప్రణవ గ్రూప్ సీటీఓ రాంబాబు బూరుగు, ఓయు సీనియర్ ప్రొఫెసర్ జిబి రెడ్డి, టిహబ్ సీఈఓ శ్రీనివాస్ మహంకాళి తదితరులు పాల్గొని మాట్లాడారు.