అన్ని కులాలకు సముచిత న్యాయం కల్పిస్తూన తెలంగాణ ప్రభుత్వం

.- ధర్మారం గ్రామానికి ₹ 4 కోట్ల నిధులతో అభివృద్ధి..
– నుండి మాధవ్ నగర్ వరకు కోట్ల రూపాయలతో సెంటర్ లైటింగ్ ఏర్పాటు..
– ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అన్ని కులాలకు సముచిత న్యాయం చేస్తున్నారని రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం డిచ్ పల్లి మండలం ధర్మారం బి హైవే పై ఉన్న క్యాథలిక్ చర్చి, నడిపల్లి గ్రామంలో ఉన్న సిఎస్ఐ చర్చిలలో ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా పాల్గొని ఏసుక్రీస్తు ప్రభువులకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాలు, అన్ని మతాలకూ సమాన ప్రాధాన్యం కల్పిస్తూ సర్వమత సమ్మేళనానికి నిదర్శనంగా నిలుస్తున్నారని అన్నారు. ధర్మారం గ్రామానికి ₹ 4 కోట్ల నిధులతో, గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాలు, కుల సంఘ భవనాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.నడిపల్లి నుండి మాధవ్ నగర్ వరకు కోట్ల రూపాయలతో సెంటర్ లైటింగ్ నిర్మించుకోవడం జరిగిందని పేర్కొన్నారు.క్రిస్మస్‌ పండగ కు క్రైస్తవులకు ప్రేమవిందు ఏర్పాటు చేస్తున్నారని, కానుకలు పంపిణీ చేస్తున్నారని వివరించారు. క్రైస్తవుల కోసం హైదరాబాద్‌లో క్రైస్తవ సంక్షేమ భవనాన్ని నిర్మించేందుకు ఇటీవలే శంకుస్థాపన జరిగిందని గుర్తుచేశారు. ఈ ఒక్క మతస్తులకే కాదు, హిందువులకు ముస్లింల పండగలకు కానుకలు ఇస్తూ తేనేటి విందులు ఇస్తూ అన్ని కులాలకు సముచిత న్యాయం కల్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వం, ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి ప్రతి అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుతున్నాయని, ఆసరా పింఛన్, బీడీ పింఛన్, కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ ముఖ్యమంత్రి సహాయనిధి, రైతుబంధు, రైతు బీమా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు. దేశంలో ఏక్కడ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ సర్కార్ మాత్రమే నని అన్నారు.కానీ కొంతమంది బీజేపీ నాయకులు, మతాన్ని అడ్డం పెట్టుకొని, ముఖ్యంగా శ్రీరాముని అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు చేస్తున్నారు. హిందువుల మై ఉండి, దేశాన్ని పాలించే ముగ్గురు, ప్రధాని, దేశ హోంశాఖ, దేశ రాష్ట్రపతి, ముగ్గురు హిందువులే మరి ఎందుకు దేశం ప్రమాదంలో ఉందనటం చేప్పడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపి పార్టీ చెప్పే అబద్ధాలను నమ్ముతున్న యువకులు మేలుకోవాలని పిలుపు ఇచ్చారు. మన దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోధీ ₹ 100 లక్షల కోట్లు అప్పులు చేశారని, అప్పు చేసి మరి ఏ గ్రామానికి అయినా రూపాయి ఇచ్చిండా అంటే అది లేదు, అబద్ధ ప్రచారాలు చేసుకోవడం మతాన్ని అడ్డం పెట్టుకొని, ముఖ్యంగా రామున్ని అడ్డం పెట్టుకొని, రావణాసుడులా రాజకీయం చేస్తున్నా బిజెపి పార్టీ, యువతను తప్పుదోవ పట్టిస్తూ మత రాజకీయం చేయడం తప్ప ప్రజలకు చేసింది శూన్య మన్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నాడని, వారి దగ్గర ఉన్న వ్యక్తులు 15 లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసి ప్రభుత్వానికి ఎగబెట్టి వేరే దేశానికి పారిపోయారని దుయ్యబట్టారు. ఇలాంటి దుర్మార్గులకు ఇలాంటి బీజేపీ పార్టీకి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. అనంతరం క్రైస్తవ సోదరులకు ప్రేమతో ఆహ్వానించినందుకు, పాస్టర్, క్రైస్తవ సోదరీమణులకు ఆధ్యాత్మిక దినోత్సవం శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపారు.అదేవిధంగా రాష్ట్ర ప్రజలు, ఏసుక్రీస్తు యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని యేసుని ప్రార్థించాలని పాస్టర్లను కోరారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలో డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పిటిసి దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య, మండల అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీల పోరాం అధ్యక్షులు దండుగుల సాయిలు, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు శక్కరి కోండ కృష్ణ, ఓడెం నర్సయ్య, పద్మారావు, యూసుఫ్, చర్చి పాస్టర్లు, క్రిస్టియన్ సోదరీమణులు, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు ఉపసర్పంచ్లు ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love