తెలంగాణలో గ్రూపు-1, 2, 3 పరీక్షల షెడ్యూల్ విడుదల

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్‌సీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. జూన్ 9న గ్రూపు-1 ప్రిలిమ్స్, అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగష్టు 7, 8వ తేదీల్లో గ్రూపు-2, నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూపు-3 పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Spread the love