మూడు క్లస్టర్లుగా తెలంగాణ

నవతెలంగాణ హైదరాబాద్‌: తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ఔటర్‌ రింగ్ రోడ్డు లోపల ప్రాంతం అర్బన్‌ క్లస్టర్‌గా, ఓఆర్‌ఆర్‌ – ఆర్ఆర్‌ఆర్‌ (ORR-RRR) మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్‌ క్లస్టర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ప్రాంతమంతా రూరల్‌ క్లస్టర్‌గా విభజించనున్నట్టు సీఎం చెప్పారు. బల్క్‌ డ్రగ్‌ ఉత్పత్తి సంస్థల అసోసియేషన్‌ ప్రతినిధులతో శనివారం  రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పెట్టుబడులు ఆహ్వానించేలా ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం అమలు చేస్తాం. హైదరాబాద్‌ తరహాలో రాష్ట్రమంతటా అభివృద్ధి చేస్తాం. అన్నిరంగాల పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తాం. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారి ప్రతి పైసాకు రక్షణ కల్పిస్తాం. పారిశ్రామిక అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా.. అన్ని ప్రాంతాల్లో జరగాలి. పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలి. కొత్తగా ఫార్మా విలేజీలు నిర్మిస్తాం. 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలి. సుదీర్ఘ లక్ష్యంతో మెగా మాస్టర్‌ పాలసీ రూపకల్పన చేస్తున్నాం. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారి ప్రతి పైసాకు రక్షణ కల్పిస్తాం. పారిశ్రామిక అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా.. అన్ని ప్రాంతాల్లో జరగాలి. పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలి“. అని అన్నారు.
ఫార్మాసిటీపై ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి. ఇది ఒకే చోట కాకుండా ఫార్మా విలేజీలు అభివృద్ధి చేస్తాం. ఓఆర్‌ఆర్‌కు 14 రేడియల్‌ రోడ్లు, 12 హైవేల కనెక్టివిటీ ఉంది. ఓఆర్‌ఆర్‌, హైవేలకు దగ్గరలో ఉండేలా.. సుమారు వెయ్యి నుంచి 3వేల ఎకరాలకు ఒక ఫార్మా విలేజ్‌ను అభివృద్ధి చేస్తాం. ప్రజల జీవనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పరిశ్రమలు ఉండాలి. సొలార్‌ పవర్‌ పాలసీని రూపొందిస్తాం జహీరాబాద్‌లో ఐటీ, ఫార్మా, హెల్త్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, స్పోర్ట్స్‌, ఆటోమొబైల్‌, ఆర్గానిక్‌ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. రక్షణ, నావికా రంగం పరికరాల తయారీకి అపార అవకాశాలున్నాయి.

 సొలార్‌ పవర్‌ పాలసీ
సొలార్‌ ఎనర్జీ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం అందిస్తాం. రాష్ట్రంలో సుమారు 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా యువతను భారంగా భావించడం లేదు. పారిశ్రామిక అభివృద్ధిలో వారు భాగస్వాములు అయ్యేలా చూస్తాం. యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు స్కిల్స్‌ వర్సిటీ పెడతాం. ఇక్కడ డిగ్రీలు పొందిన వారికి ఉపాధి లభించేలా ఉండాలి. ప్రపంచంలో ఎక్కడైనా నిలదొక్కుకునేలా యువత సామర్థ్యాలు పెంచుతాం’’ అని వెల్లడించారు. రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు.. వెల్‌స్పన్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ బి.కె.గోయెంకా సీఎం రేవంత్‌ను కలిశారు. తెలంగాణలో ఐటీ సేవల రంగంలో రూ.250 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలిపారు. వికారాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఐటీ అభివృద్ధికి సిద్ధంగా ఉన్నట్టు సీఎంకు వివరించారు.

Spread the love