రాష్ట్రవ్యాప్తంగా ఠానూ నాయక్‌ వర్ధంతి సభలు : తెలంగాణ గిరిజన సంఘం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఠానూ నాయక్‌ వర్థంతి సభలు నిర్వహించ నున్నట్టు తెలంగాణ గిరిజన సంఘం (టీజీఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్‌, ఆర్‌ శ్రీరాంనాయక్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఠానూ నాయక్‌ విగ్రహాన్ని ట్యాంక్‌ బండ్‌ పై ఏర్పాటు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. వీరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీర మరణం పొందిన గిరిజన యోధుడు ఆయన అని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఠానూ నాయక్‌ 73 వ వర్ధంతి సభలను ఆదివారం జిల్లా, మండల కేంద్రాలతో పాటు తండాల్లో నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు.

Spread the love