– ఉప్పల శ్రీనివాస్ గుప్త
నవతెలంగాణ – నాగోల్
తెలంగాణలో ఆర్యవైశ్యుల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, ఇంటర్నేషనల్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస గుప్త అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద ర్భంగా ఉప్పల శ్రీనివాస గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన కాం గ్రెస్ పార్టీకి తమ మద్దతు ఉంటుందని అన్నా రు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడి యం కావ్యకు సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టు తెలిపారు. వరంగల్ ఎంపీగా కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైశ్యుల్లో చాలా మంది నిరుపేదలు ఉన్నారని వారికి ఈ కార్పొరేషన్ దోహదడుతుందని తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆర్య వైశ్యులను ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా కషి చేస్తుందని పేర్కొన్నారు. ఆర్య వైశ్యులు అభివద్ధి చెందాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లురి మధు, శ్రీధర్, బిజ్జల నవీన్, మహిళా విభాగం అధ్యక్షురాలు శైలజ, తోట హరీశ్, వీరన్న, చిట్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విలేకరుల సమావేశానికి ముందు ఉప్పల శ్రీనివాస గుప్తా రాష్ట్ర మంత్రి కొండ సురేఖను స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలను మర్యాదపూర్వకంగా కలిశారు.