ఆ ఘడియ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

నవతెలంగాణ న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. మువ్వన్నెల జెండా చూస్తే మన హృదయం ఉప్పొంగుతుందని చెప్పారు. దేశ జీడీపీ ఏటా పెరుగుతోందని ఆమె వివరించారు. భారత్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని కొనియాడారు. ‘‘ దేశంలో గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆదివాసీల అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మన మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు మహిళలు సిద్ధపడుతున్నారు. ఈ ఏడాది చంద్రయాన్‌-3ను ప్రయోగించుకున్నాం. చంద్రయాన్‌-3 జాబిల్లిపై అడుగుపెట్టే ఘడియ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. పర్యావరణ పరిరక్షణ కోసం అనేక చర్యలు చేపట్టాం. సౌర, పవన విద్యుదుత్పత్తి పెంచే కార్యక్రమాలు చేపట్టాం. 2047లోగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్‌ ఉండాలి. స్వాతంత్ర్య దినోత్సవం ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది’’ అని రాష్ట్రపతి తెలిపారు.

Spread the love