కేసీఆర్ పాలనతో ఫరిడవిల్లుతున్న ఆధ్యాత్మిక వైభోగం

– సర్వ మతాల సంరక్షకుడు కెసిఆర్
– బతుకమ్మ,క్రిస్మస్, రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం
– గంగ జమున తెహజీబ్ గా సర్వమత పండుగలు
– 9ఏండ్లలో ఆలయ అభివృద్ధి కి 2500 కోట్ల కేటాయింపు
– నిత్యం భగవంతుని సేవలో ఉండే అర్చకులకు గౌరవ వేతనం
– ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల
నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ నీల కంటేశ్వర ఆలయం లో సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ఆలయాలు సరికొత్త వైభవాన్ని సంతరించుకొని ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరజిల్లుతున్నాయి. సర్వ మతాల సంరక్షకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ,రంజాన్,క్రిస్టమస్ పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నారు.లోక కళ్యాణార్థం మహచండి యాగం,సుదర్శన యాగం అనేక పూజలు నిర్వహించిన గొప్ప ఆధ్యాత్మిక వేత్త మన ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యమంత్రి గారి పాలన మరియు యాగ ఫలాల వల్ల తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం మారింది.భగవంతునికి ,భక్తులకు వారధిగా ఉన్న అర్చకులకు వేతనాలు పెంచి వారి గౌరవాన్ని నిలిపారు.బ్రాహ్మణ సంక్షేమానికి బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి కృషిచేశారు.1250 కోట్ల రూపాయలతో యాదాద్రి ఆలయాన్ని పుణ:నిర్మాణం చేసి కలియుగ వైకుంఠం గా తీర్చిదిద్దారు.వేములవాడ రాజన్న, ధర్మపూరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలను 100 కోట్ల తో అభివృద్ధి చేస్తుంది.భద్రాద్రి రామ చంద్ర ఆలయం అభివృద్ధి ప్రభుత్వం కట్టు బడి ఉంది.కాకతీయుల కళ వైభవానికి చిహ్నంగా ఉన్న రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు వచ్చేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. శబరిమల, కాశీ కి వెళ్లే భక్తుల సౌకర్యార్థం వసతి గృహం నిర్మిస్తుంది ప్రభుత్వం.ముఖ్యమంత్రి కేసీఆర్ సరి కొత్త ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకవచ్చిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ని ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ ,జడ్పీ చైర్మన్ విఠల్ రావు,నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు,సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, సిర్ప రాజు, కంటేశ్వర్ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బిళ్ళ మహేష్, ప్రధాన కార్యదర్శి కులచారి సంతోష్,కోశాధికారి హరి బాబు, సభ్యులు ఇరుముల శంకర్, కసుభ సంపత్, చిన్నం గారి గంగ రెడ్డి, నర్సింగ్ పల్లి అశోక్, కంచెట్టి వర లక్ష్మీ, గోపరి గంగదర్, వేముల భుమేష్, కొండవత్రి రాజేందర్, జుంభారతి గంగమని, కార్యనిర్వహాణాధికారి వేణు తదితరులు పాల్గొన్నారు.

Spread the love