లైన్ మేన్ ను గ్రామపంచాయతీలో బంధించిన గ్రామస్తులు…

నవతెలంగాణ-డిచ్ పల్లి
గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యలు తీర్చకుండా సమయానికి బిల్లులు కట్టించుకుంటున్నారని ఆగ్రహించిన గ్రామస్తులు గ్రామ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో బుధవారం విద్యుత్ శాఖ లైన్ మేన్ ను పంచాయతీ కార్యాలయంలో బంధించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నపాటి ఈదురు గాలులు, వర్షానికే గ్రామంలో విద్యుత్ కు తివ్ర అంతరాయం ఏర్పడుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా విద్యుత్ శాఖ దికారులు స్పందించి గ్రామానికి సపరేట్గా వ్యవసాయ లైన్లతో సంబంధం లేకుండా ప్రత్యేకమైన ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ది కమిటీ అధ్యక్షులు నర్సయ్య, క్యాషియర్ శ్రీనివాస్ రెడ్డి తోపాటు గ్రామస్తులు,విడీసీ సభ్యులు తదితరులు ఉన్నారు.

Spread the love