దేశం మొత్తం ఎదురు చూస్తోంది

నాని నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్‌ ఒదెల దర్శకత్వంలో, కీర్తి సురేష్‌ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌ పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, ‘సతీష్‌ మాస్టర్‌ ఈ సినిమాతో బిజీ అయిపోతారు. సుధాకర్‌ సినిమా ఆరంభం నుంచి సపోర్ట్‌ చేశారు. నిర్మాతకు అసలైన రివార్డ్‌లు, అవార్డులు మొదలవుతాయని భావిస్తున్నాను. దీక్షిత్‌ లాంటి మంచి నటుడు దొరికాడు. శ్రీకాంత్‌ గొప్ప దర్శకుడు. కీర్తి పెర్‌ఫార్మెన్స్‌ అద్భుతంగా చేసింది. ఈ సినిమాలో మాకంటే ఎక్కువ కష్టపడిన మా గ్యాంగ్‌కు థ్యాంక్స్‌. ప్రమోషన్లలో నేను గమనించింది ఒక్కటే.. ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. అంతేకాదు థియేటర్‌లో ఈ సినిమా హిస్టీరియా క్రియేట్‌ చేస్తుందని చెప్పగలను’ అని తెలిపారు. ”నేను లోకల్‌’ తర్వాత నానితో చేయడం ఆనందంగా ఉంది. క్లైమాక్స్‌ చాలా బాగుంటుంది. సంగీతం బాగా కుదిరింది. సత్యం కలర్‌ టోన్‌ బాగా చేశారు. టీజర్‌, ట్రైలర్‌ చూశారు కదా.. సినిమా కూడా అలాగే ఉంటుంది’ అని నాయిక కీర్తి సురేష్‌ అన్నారు. ‘నానితో మూడేళ్ళుగా ఈ కథ కోసం ఎదురు చూశాం. సినిమా తప్పకుండా అందర్నీ అలరిస్తుంది’ అని నిర్మాత సుధాకర్‌ చెరుకూరి తెలిపారు. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల మాట్లాడుతూ, ‘ఈనెల 30న థియేటర్లలో కలుద్దాం’ అని అన్నారు.

Spread the love