రోజంతా చురుగ్గా ఉండాలంటే…

మహిళలు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు పనులు చేస్తూనే ఉంటారు. దీని వల్ల అలసట తీవ్రంగా ఉంటుంది. కొందరు కొంచెం పని చేసే సరికి అలిసిపోతే, మరికొందరు సాయంత్రం అయ్యేసరికి నీరసించి పోతారు. అయితే రోజంతా అలసి పోకుండా చలాకీగా పని చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేటంటే…
– ఉదయం లేవగానే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం పిండి అందులో ఒక స్పూన్‌ తేనె కలిపి తీసుకుంటే రోజంతా చలాకీగా ఉంటుంది.
– ప్రతిరోజూ సాధ్యమైనంత వరకు పండ్లు, పండ్ల రసాలు తాగితే శరీరానికి మంచిది.
– బీట్‌రూట్‌, క్యారెట్‌, క్యాబేజీ, కాకర వంటి వాటిలో ఏదో ఒకదాన్ని జ్యూస్‌గా తీసుకుని తాగితే మేని కాంతి పెరుగుతుంది.
– పగలైనా రాత్రయినా ఎప్పడూ ఓ నిర్ణీత సమయంలో భోజనం చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
– ఆహార పదార్థాల్లో ఉప్పు తక్కువగా ఉండాలి. స్వీట్లు ఎక్కువ తినకూడదు.
– పడుకునే ముందు గ్లాసు పాలలో తేనె వేసుకుని కానీ, ఏదైనా ఓ పండు కానీ తింటే హాయిగా నిద్రపడుతుందంటున్నారు.

Spread the love