- Advertisement -
నవతెలంగాణ-కుభీర్
మండలంలోని జాంగాం గ్రామానికి చెందిన అబ్దుల్ సలీం అనే రైతుకు చెందిన రెండు గేదలు గురువారం విద్యుత్ షాక్ తో మృతి చెందిన జరిగింది. గురువారం ఉదయం రోజు మాదిరిగానే వ్యవసాయ క్షేత్రానికి మేత మేయడానికి తీసుకువెళ్లే క్రమంలో గేదలు మేత వేస్తుండగా ప్రమాదవశత్తు విద్యుత్ ట్రాన్స్ఫారం తగిలి ఒక్కసారిగా షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు విడవడం జరిగింది. చనిపోయిన రెండు గేదెల విలువ సుమారు రూ.1,70,000 వరకు ఉంటుందని రైతు తెలిపారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతుకు నష్టపరిహారం అందేలా చూడాలని రైతు కోరారు.
- Advertisement -



