దులీప్‌ ట్రోఫీ సౌత్‌జోన్‌దే!

బెంగళూర్‌ : సౌత్‌ జోన్‌ దులీప్‌ ట్రోఫీ విజేతగా నిలిచింది. 298 పరుగుల ఛేదనలో 222 పరుగులకే కుప్పకూలిన వెస్ట్‌జోన్‌ 75 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సౌత్‌ జోన్‌ బౌలర్లు వాసుకి కౌశిక్‌ (4/36), సాయి కిశోర్‌ (4/57) నాలుగేసి వికెట్లు పడగొట్టారు. వెస్ట్‌ జోన్‌ బ్యాటర్లు ప్రియాంక్‌ పంచల్‌ (95), సర్ఫరాజ్‌ ఖాన్‌ (45) మెరిసినా.. ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. పృథ్వీ షా (7), పుజారా (15), హార్విక్‌ దేశారు (4) విఫలమయ్యారు. సౌత్‌జోన్‌ వరుస ఇన్నింగ్స్‌ల్లో 213, 230 పరుగులు చేయగా.. వెస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌటైంది. సౌత్‌జోన్‌ బౌలర్‌ విద్వత్‌ కావేరప్ప ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ (15 వికెట్లు) అవార్డులు అందుకున్నాడు.

Spread the love