పూజలు చేస్తున్న కౌశిక్ రెడ్డి ఎంపీపీ రేణుక గ్రామస్తులు

– మల్లారెడ్డిపల్లిలో బొడ్రాయి ఉత్సవాలు
– హాజరైన ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ-వీణవంక
మండలంలోని మల్లారెడ్డి పల్లి గ్రామంలో బొడ్రాయి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్లను ప్రతిష్టించుకోవడం శుభపరిణామం అన్నారు. గ్రామాన్ని గ్రామదేవతలు చల్లంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, జెడ్పిటిసి మాడ వనమాల సాధవరెడ్డి, సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి, మాజీ సర్పంచ్ సమ్మిరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love