ఉద్యమ కెరటాలు మొదలైంది

ఇంద్ర ఫిలిమ్స్‌ బ్యానర్‌పై పిడమర్తి రవీంద్ర దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘ఉద్యమ కెరటాలు’. ఈ చిత్రంలో హీరోగా చందు రాగం, హీరోయిన్‌గా హాసిని, ప్రీతి సుందర్‌ నటిస్తున్నారు.ఈ చిత్ర పూజ కార్యక్రమం ప్రసాద్‌ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కాసర్ల శ్యామ్‌ యూనిట్‌ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’గోరేటి వెంకన్నతో కలిసి పాటలు రాయడం అదష్టంగా భావిస్తున్నాను’ అని చెప్పారు.
‘తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సినిమాకి పనిచేయడం గర్వంగా ఉంది. ఈ సినిమాకి మంచి పాటలు అందిస్తాను’ అని సంగీత దర్శకుడు బోలె షావలి అన్నారు.
హీరో చందు రాగం మాట్లాడుతూ,’ఇలాంటి చారిత్రాత్మక సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత పిడమర్తి రవీంద్రకి కతజ్ఞతలు’ అని తెలిపారు. ‘ఈ జనరేషన్‌ యువతకి తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని తెలియజేయడానికి ఈ సినిమాను నిర్మిస్తున్నాను. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా కచ్చితంగా మెప్పిస్తుంది’ అని దర్శక, నిర్మాత పిడమర్తి రవీంద్ర అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: భోలే షావలి, పాటలు: కాసర్ల శ్యామ్‌, గోరేటి వెంకన్న, డిఓపి : వెంకట్‌ హనుమ, గాయనీ గాయకులు: మధు ప్రియ, వరం, డాన్స్‌: గణేష్‌ మాస్టర్‌.

Spread the love