ప్రజలు ఎవరిని నమ్మాలి?

Who should people believe?ఐదు రాష్ట్రాల ఎన్నికల సంగ్రామం మొదలైంది. మన తెలంగాణ రాష్ట్రంలో నవంబర్‌ 30న ఎన్నికలు, డిసెంబర్‌ 3న ఫలితాలు వెల్లడించ నుంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలు మేనిఫెస్టో(పథకా)లు వెల్లడిస్తున్నారు. పార్టీ(నాయకు)లు ఒకరిని మించి ఇంకొకరు ఓటర్లను ప్రసన్నం చేసుకోవ డానికి మేనిఫెస్టోలో ఆశలు రేపే హామీల జోరు కొనసా గుతుంది. మా పథకాలను మీరు కాఫీ కొట్టారని! కాదు మీరే కాపీ కొట్టారని మాటల జోరు వేడిని పెంచుతున్నారు. నేటి తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే? ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా పార్టీ(నాయకు)లు కప్ప దాటుడును.. జంప్‌ జిలానీలను ప్రోత్సహిస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలు, వాగ్దానాలను, ఇచ్చిన మాటలను తుంగలో తొక్కేసి రాత్రికి రాత్రే పార్టీ (కండువా)లు మార్చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధించడానికి ఎన్ని చట్టాలు చేసినా లాభం లేకుండా పోతుంది. రాజకీయాల్లో నైతిక విలువలు కనుచూపు మేరలో కానరావడం లేదు. ప్రజాస్వామ్య విలువలు అడుగంటి పోతున్నాయి. సీటుకు నోటు, ఓటుకు నోటు, తాయిలాలు, ఉచితాల హామీలతో ఓటర్లను తమ ఖాతాలో వేసుకునడానికి పడరాని పాట్లుపడుతు న్నారు. మీరు చేసింది శూన్యం!,కాదు మీరేం చేశారని విమర్శలు, ప్రతి విమర్శలతో వారిని బంగాళాఖాతంలో కలపండి అంటే? కాదు వారిని పాతాళంలోకి నేట్టేయండనే మాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతూ ఓట్లు రాబట్టుకునే ప్రయ త్నాల్లో అన్ని పార్టీలు ”ఆ తాను ముక్కలే” అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ (నాయకు)లు సభలు, సమావేశాలతో దూకుడుగా ప్రచార వేగాన్ని పెంచుకుంటూ దూసుకుపోతున్నారు. ఎవ రిని నమ్మాలనే ప్రజలకు కన్ఫ్యూజన్లో మైండ్‌ గేమ్‌ (మాన సిక క్రీడ) మొదలైంది. అన్ని పార్టీ(నాయకు)లు డాక్టర్‌ అంబే ద్కర్‌ అందించిన ”ఓటు బలమైన ఆయుధం” మీ స్థితి గతులను రాష్ట్ర, దేశ పరిస్థితులను మార్చే ఓటును ఆగం గాకుండా ఆలోచించి, మీకు మేలు చేసే వారికి ఓటు వేయండి అనే ఓటు నీతు(భజన)లు మొదలుపెట్టారు. ఎవరిని నమ్మాలో! ఎవరిని నమ్మకూడదో.. అర్థం కాని అయోమయ స్థితిని సృష్టిస్తున్నారు నాయకులు, పార్టీలు.” ప్రజల నమ్మకం అమ్ముడై పోవడంతో”. మీ కోసమే పార్టీలు ఫిరాయి స్తున్నామని అభివృద్ధి బోధన లతో ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తు న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి ప్రజాపాలకులను నమ్మి జాతి పురోభివద్ధి కోసమే నని నమ్మకం పునాదుల మీద పార్టీ (నాయకు) లకు ఓట్లు వేస్తూనే ఉన్నారు. ఓట్లు పడి అధికారం చేతికొచ్చాక హామీలు, మేనిఫెస్టో అమలు చేయని ఫలితంగానే దేశంలో, రాష్ట్రాల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ, స్వేచ్ఛలో అసమా నతల అగాధం పెరిగిపోతున్నాయి. దేశ సంపద గుప్పెడు మంది చేతు (జేబు)ల్లో ఉండిపోయింది. ప్రతిసారి ఎన్నికల ముందు ఇదే తంతు కొనసాగు తుంది. ఆ తర్వాత ”ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్నట్లుగా ప్రజానీకం పరిస్థితులు ఉన్నాయి.
మన రాష్ట్రంలో ఎన్నికలవేళ ప్రజల నాడిని అంచనా వేయడం పేరుతో పోల్‌ సర్వే సంస్థలు హడావుడి చేస్తున్నాయి. ఇలా ఎన్నికల ముందు నుండే వందలాది సర్వే సంస్థలు ఫీల్డ్‌ స్టడీ మొదలెట్టాయి. ఈ ఎన్నికల్లో విజయ అవకాశాలు ఎలా! ఏ మేరకు ఉన్నాయని అన్ని పార్టీలు సొంత సర్వే సంస్థలచే సర్వే చేయించుకుంటు న్నాయి. వాటి ఆధారంగానే వ్యూహాలు రచించాయి. వివిధ టెలివిజన్‌ ఛానల్స్‌, వార్తాపత్రికలు సొంతంగా కానీ లేదా సర్వే సంస్థల ద్వారా చేస్తున్నాయి. వీటిని ఒపీనియన్‌ పోల్స్‌ అంటారు. వీటి ఆధారంగా చర్చాగోష్టులను నిర్వ హిస్తున్నారు. వీటిలో వైరి వర్గాలు గొడవలు పడుతున్న తీరును చూస్తున్నాం. ఈ సంస్థలే పోలింగ్‌ ముగిసిన తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహిస్తాయి.ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లో, ఎన్ని సీట్లో జోస్యం చెప్తాయి. వాస్తవానికి ఈ సర్వే లన్నీ విశ్వసనీయతలో అనుమానాలు ఉన్నాయి. ఖచ్చిత మైన అంచనాలు నిరూపించబడలేదు. ఒపీనియన్‌, ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే అంచనాలకు వాస్తవ ఫలితాలకు మధ్య తేడాలే కనిపించాయి.కొన్నిసార్లు అయితే చాలా భిన్నంగా కూడా వచ్చాయి. ఇలాంటి వేల కనీసం తప్పుడు అంచనాలను ప్రజలపై రుద్దినందుగాను క్షమాపణ కూడా కోరలేదు!. కొన్ని దేశాల్లో శాస్త్రీయ పద్ధతుల్లో సర్వేలు నిర్వహిస్తు న్నారు. కొన్ని నియోజకవర్గాల్లోనో, కొద్దిమంది అభిప్రా యాలను సేకరించి ఓ నిర్ధారణకు రావడం చాలా కష్టం. అందువల్లే కచ్చితత్వం లోపిస్తుంది. ఈ విషయం సర్వే సంస్థలకు తెలిసిన ఒప్పుకోరు. దీని వెనుక అనేక అపో హలు, ఆర్థిక లావాదేవీలు ఉంటున్నాయని తెలుస్తుంది. ఈ సంస్థలన్నీ ఎన్నికల సర్వేల పేరిట ప్రజలను నమ్మించేందుకే పార్టీ (నాయకు)లు ఉపయోగించుకుం టాయన్న అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. పార్టీలు ప్రజల్లో ఈ సర్వేల కన్ఫ్యూజన్‌ సష్టిస్తున్నారు. వీటి మెథడాలజీ, శాస్త్రీ యతపై సందేహాలున్నాయి.షెడ్యూల్‌ విడుదలయ్యేంత వరకే ఈ సర్వేల హల్చల్‌ చేస్తాయి,ఆ తర్వాత నిషేధించబడుతాయి. ఆ తర్వాత ఎన్నికల అనం తరం ఫలితాలకు ముందు ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటిస్తారు. వాటిలోనూ అంచనాలు తారుమారే అవుతున్నాయి. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం జోరందు కుంటున్నది.
దేశంలోనే ఎక్కువ మొబైల్‌ ఫోన్లు వినియోగించే రాష్ట్రాల్లో తెలంగాణ 9వ స్థానంలో ఉంది. అందుకే రాజ కీయ ప్రచారంలో సామాజిక మాధ్యమాల పాత్ర కీలకంగా మారింది. అన్ని పార్టీలు సోషల్‌ మీడియా విభాగాలను ఏర్పాటు చేసుకోగా, ఇప్పుడు వార్‌ రూమ్లను రంగంలోకి దింపాయి. ఓటర్‌ నాడిని పట్టుకొని వారి మనసును సాంకే తిక తంత్రంతో మార్చడమే వాటి పని. తమ అభ్యర్థుల గెలుపుతో పాటే, ప్రత్యర్థి స్థైర్యాన్ని దెబ్బతీయడమే వాటి లక్ష్యం. ఆ మేరకు తమ వ్యూహాలను పదను పెడుతు న్నాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ఓటర్ల చెంతకు తీసుకెళ్లడం వార్‌రూమ్ల ఏర్పాటు లక్ష్యం. అన్ని పార్టీ భావ జాలాలని, ప్రత్యర్థి బలహీనతలను ప్రజల మనసుల్లోకి చొ ప్పించే వ్యూహాలను సిద్ధం చేస్తాయి. స్వల్ప నిడివితో ఉండే వీడియోలు, పంచులతో ఉండే చిత్రాలను సిద్ధం చేసి నిత్యం సామాజిక మాధ్యమాల్లో వదులు తుంటాయి. ఈ వార్‌ రూమ్‌ బందంలో 10 నుంచి 15 మంది సభ్యులు ఉంటారు. ఈ ఒప్పందం ప్యాకేజీ రూ.కోట్లలోనే ఉంటుం దని తెలుస్తోంది. ప్రజల్లో నానుతున్న అంశమే వారు రూముల ప్రధాన ఆయుధం. ఎక్కడైనా ఒక నాయకుడు సంబంధించిన లోపం వెలుగు చూస్తే సినిమాల్లో దానికి సంబంధించిన సన్నివేశాలు వ్యంగ్యమైన వ్యాఖ్యలు జత చేసి దృశ్యం ఇవ్వడం. అలాంటి వాటిని స్మార్ట్‌ఫోన్లు వినియోగించి ఓటర్లతో అను సంధానం కావడం వీరి ప్రధాన విధుల్లో ఒకటి. సామాజిక మాధ్యమ బృందాలు ఏర్పాటు చేసి వార్‌రూంలో రూపొందించే అంశాలు వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్బుక్‌, ఇనిస్టా, యూ ట్యూబ్‌లలో పోస్ట్‌ చేస్తుంటారు. ఇలా పార్టీల తరఫున ప్రచారంలోకి వార్‌ రూమ్లో పద్ధతిలో బలాలు, లోపాలు, అస్త్రాలుగా ఉపయోగించి తెరచాటు యుద్ధం కొనసాగిస్తున్నారు.
ఇప్పటికైనా పార్టీ(నాయకు)లు ప్రజల ఆకాంక్షల మేరకు పాలిస్తామని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యపాలన నేతల స్వార్థం కోసం కాదు? ప్రజల సమ్మిళిత అబివృద్ధి కోసమేనని గ్రహించి నడుచు కోవాలి. చేసిన ప్రమాణా (హామీ)లకు కట్టుబడి ఉండాలి. రాజకీయాల్లో నైతిక విలువలు నిలబెట్టుకోవాలి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయరాదు. ప్రజల పవిత్రమైన ఓటును అంగడి సరుకు చేయబోమనే హామీ ఇవ్వాలి. ప్రశ్నించే స్వేచ్ఛను పరిరక్షిస్తామని, ఆచరణాత్మక హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసు కోండి.. శంకించవలసింది ఓటర్లను కాదు, ముమ్మాటికి రాజకీయ పార్టీ(నాయకు)లనే ఆత్మ విమర్శ చేసుకొని చిత్తశుద్ధితో జాతి సంపదను పౌరులకు సమంగా పంచుతామని, పౌర స్వేచ్ఛను కాపాడుతామని ఓట్లను వినమ్రంగా అర్ధించండి. ప్రజా చైతన్యానికి పరీక్షా కాలమే! అయినా తగ్గేదే లేదంటూ, అన్‌ స్టాపబుల్‌గా ఓటర్లు మన:సాక్షిగా మీ సమస్యలు పరిష్కారం చేసేవారికి స్వేచ్ఛగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటేయండి.. ఇదీ ఓటర్‌ చైతన్యమని నిరూపించండి..
– మేదాజీ

Spread the love