– చల్లధనంగా పాదరక్షలు
– క్యాంపస్ యాక్టివ్వేర్ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రముఖ స్పోర్ట్స్, అథ్లెయిజర్ పాదరక్షల బ్రాండ్లో ఒక్కటైనా క్యాంపస్ యాక్టివ్వేర్ కొత్తగా ఎయిర్ టర్బో టెక్నాలజీతో ప్రత్యేక శ్రేణీ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ఈ పాదరక్షల సాంకేతికతను భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు పేర్కొంది. క్యాంపస్ ఎయిర్ టర్బోతో రోజంతా వినియోగదారుల పాదాలను చల్లగా, తాజాగా, సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపింది. షూ వెనుక భాగంలో ఇన్లెట్, అవుట్లెట్ పోర్ట్ ఉండటంతో గాలి ప్రసరణకు గేట్వే లా ఉంటుందని క్యాంపస్ యాక్టివ్వేర్ లిమిటెడ్ సిఎంఒ ప్రేరణా అగర్వాల్ తెలిపారు. క్యాంపస్ ఎయిర్ టర్బో శ్రేణీ ప్రారంభ ధర రూ.2,299గా నిర్ణయించింది.