బిహార్‌లో దారిమళ్లిన యోగి హెలికాప్టర్‌..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఒకటి బిహార్‌లో దారిమళ్లింది. ఒక ప్రాంతానికి బదులు మరో ప్రాంతానికి వెళ్లింది! లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి గురువారం బిహార్‌కు వెళ్లారు. బీజేపీ ముందుగా విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం- పశ్చిమ చంపారణ్‌లో ర్యాలీతో రాష్ట్రంలో ఆయన పర్యటన ముగియాలి. అంతకంటే ముందు తూర్పు చంపారణ్‌లో ప్రసంగించాలి. కానీ హెలికాప్టర్‌ దారిమళ్లడంతో తొలుత పశ్చిమ చంపారణ్‌కు, ఆ తర్వాత తూర్పు చంపారణ్‌కు ఆయన వెళ్లాల్సి వచ్చింది. పశ్చిమ చంపారణ్‌లో ప్రసంగిస్తూ యోగి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.

Spread the love