కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం

– మూడు ప్రయివేటు బస్సులు దగ్ధం
నవతెలంగాణ – కూకట్‌పల్లి
హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పార్కింగ్‌ చేసిన మూడు ప్రయివేట్‌ బస్సుల్లో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయాయి. కూకట్‌పల్లి సీఐ నర్సింగ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. భారతి ట్రావెల్స్‌కు చెందిన ఏడు బస్సులు కూకట్‌పల్లి ఐడీఎల్‌ చెరువు సమీపంలోని షెడ్‌లో పార్కింగ్‌ చేసి ఉన్నాయి. అర్ధరాత్రి మూడు బస్సులో మంటలు చెలరేగాయి. దాంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంట లను ఆర్పారు. మిగతా నాలుగు బస్సులను మరో ప్రాంతానికి తరలించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే దాని మీద విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు.

Spread the love