ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు..

–  బుచ్చిబాబును విచారించనున్న ఈడీ
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారించనుంది. ప్రస్తుతం సీబీఐ అరెస్టు చేసిన కేసులో బుచ్చిబాబు తీహార్‌ జైలులో ఉన్నారు. ఆయనను రెండు రోజుల పాటు విచారించేందుకు ఈడీ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి కోరారు. ఈడీ విజ్ఞప్తిపై స్పందించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగ్‌పాల్‌ బుచ్చిబాబు విచారణకు అనుమతించారు. ఈ తరుణంలో గురువారం నుంచి రెండు రోజుల పాటు తిహార్‌ జైలులోనే బుచ్చిబాబును ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

Spread the love