తొలి వన్డేకు రోహిత్‌ దూరం

–  ఆసీస్‌తో వన్డేలకు జట్టు ఎంపిక
– చివరి రెండు టెస్టులకు మార్పుల్లేవ్‌
ముంబయి : ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు రోహిత్‌ శర్మ దూరం కానున్నాడు. వ్యక్తిగత, కుటుంబ కారణాలతో మార్చి 17న ముంబయిలో జరిగే తొలి వన్డేకు అందుబాటులో ఉండటం లేదు. రోహిత్‌ గైర్హాజరీలో వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య పగ్గాలు చేపట్టనున్నాడు. గత ఐదు టెస్టుల్లో 13 సగటుతో 117 పరుగులే చేసిన కెఎల్‌ రాహుల్‌ను ఆసీస్‌తో చివరి రెండు టెస్టులకూ కొనసాగించారు. కానీ టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్సీ నుంచి రాహుల్‌ను తప్పించారు. రంజీ ఫైనల్స్‌ కోసం రెండో టెస్టుకు దూరమైన జైదేవ్‌ ఉనద్కత్‌ ఇండోర్‌, అహ్మదాబాద్‌ టెస్టులకు జట్టులోకి వచ్చాడు. పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా ఫిట్‌నెస్‌ కారణాలతో టెస్టులు, వన్డేలకు దూరమయ్యాడు. భారత్‌, ఆస్ట్రేలియా రెండో వన్డేకు మార్చి 19న విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుండగా, చివరి వన్డే మార్చి 22న చెన్నైలో జరుగనుంది.
భారత వన్డే జట్టు : రోహిత్‌ (కెప్టెన్‌), గిల్‌, కోహ్లి, అయ్యర్‌, సూర్య, రాహుల్‌, కిషన్‌, పాండ్య (వైస్‌ కెప్టెన్‌), జడేజా, కుల్దీప్‌, వాషింగ్టన్‌, చాహల్‌, షమి, సిరాజ్‌, ఉమ్రాన్‌, శార్దుల్‌, అక్షర్‌, జైదేవ్‌.

Spread the love