పాలకుర్తి టూరిజం హోటల్‌కు

–  రూ.25 కోట్లు మంజూరు : జీవో జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పర్యాటక కేంద్రంగా ఉన్న పాలకుర్తిలో టూరిస్ట్‌ హోటల్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.25 కోట్లను మంజూరు చేసింది. అందుకు సంబంధించి పరిపాలనా అనుమతులతోపాటు నిధులను విడుదల చేస్తూ బుధవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతమైన పాలకుర్తి ఎంతో అభివృద్ధిని సాధిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Spread the love