బీబీసీపై ఐటీ దాడుల్ని ఖండించిన ఎమ్మెల్సీ కవిత

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బీబీసీ ఛానల్‌ కార్యాలయాలపై ఐటీ దాడుల్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. ఇది కచ్చితంగా కక్ష సాధింపు చర్యే అని మంగళవారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఒక వ్యాపార సంస్థపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వం, నిజాన్ని చూపించే ప్రయత్నం చేసిన బీబీసీపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పిందని విమర్శిం చారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన వారిని, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం అలవాటుగా మారిందన్నారు. వాస్తవాలు చూపించే మీడియా గొంతును మోడీ ప్రభుత్వం నొక్కుతున్న విషయాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పటి నుంచో చెబుతూనే ఉందని అన్నారు.

Spread the love