పెండ్లికి వెళ్తుండగా నదిలో పడిన మినీట్రక్కు..12 మంది మృతి

నవతెలంగాణ – మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ వేడుకకు వెళ్తున్న ఓ మినీ ట్రక్కు ప్రమాదవ శాత్తు నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 30కి పైగా మంది గాయపడ్డారు. దతియా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గ్వాలియర్​కు బిల్​హెటి గ్రామానికి చెందిన ప్రజలు.. టికంగఢ్​లో జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఓ మినీ ట్రక్కులో వెళ్తున్నారు. బుహరా గ్రామంలోని వంతెన వద్దకు రాగానే అదుపుతప్పి మినీట్రక్కు నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో 30 మంది వరకు గాయపడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. వీరంతా వధువును తీసుకుని పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు చెప్పారు. దీంతో పెళ్లి జరగాల్సిన వారి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

Spread the love