మూడు రాష్ట్రాల సరిహద్దు ఆలయంలో కార్తీకమాస సామూహిక పూజల్లో పాల్గొన్న 250 మంది జంటలు

– దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు జంటలకు అన్నదానం

నవతెలంగాణ- మద్నూర్: ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాల్లో ప్రఖ్యాతగాంచిన మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం నాడు కార్తీక పౌర్ణిమ సామూహిక ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా పూజారుల ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రతి సంవత్సరం నిర్వహించే కార్తీక మాస సామూహిక ప్రత్యేక పూజలకు ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లోని భక్తులు 250 మంది జంటలు ఈ ప్రత్యేక పూజలు పాల్గొన్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్ ఆలయ అధికారి వేణు కల్పన తెలిపారు. ఈ ప్రత్యేక పూజల్లో ఆలయ పూజారులు వేణు అరవింద్ శైలేందర్ జోషి వీరి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్య లో పూజలు నిర్వహించగా పూజల్లో పాల్గొన్న 250 మంది జంటలకు భోజన సౌకర్యాలు కల్పించారు.
Spread the love