- Advertisement -
నవతెలంగాణ – చండూర్
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా స్థానిక కస్తాల క్రాస్ రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి మండల అధ్యక్షుడు మహమ్మద్ షరీఫ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గంట అంజయ్య, మండల కార్యదర్శి అబ్బనబోయిన అంజయ్య, మాజీ మండల అధ్యక్షుడు ఎర్రజల లింగయ్య, బోమ్మరపోయిన కృష్ణయ్య, సాపిడి నరసింహ, సింగిరి కొండా అనిల్ కుమార్, సాయం రాములు, కనకయ్య, గండూరి కృష్ణయ్య, బోడ ఉమామహేశ్వర్,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



