నవతెలంగాణ – అశ్వారావుపేట : తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం రోజువారీ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయడానికి శాఖల వారీగా అధికారులు సిద్ధం కావాలని తహశీల్దార్ లూదర్ విల్సన్ కోరారు. ఆయన తన కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పండుగ వాతావరణంలో సంబురాలు నిర్వహించాలని అన్నాను.తెలంగాణ కు పూర్వం – అనంతరం పాలన అభివృద్ధి తెలిసేలా ఏర్పాట్లు చేసి విస్త్రుత ప్రచారం నిర్వహించాలని అన్నాను.ఎం.పి.పి జల్లిపల్లి శ్రీరామమూర్తి విజయవంతానికి పలు సూచనలు,సలహాలు చేసారు.