రామ్కిరణ్, మేఘాఆకాశ్ జంటగా నటిస్తున్న ‘స:కుటుంబానాం’ చిత్ర ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. హెచ్ఎన్జీ మూవీస్ సినిమాస్ పతాకంపై ఉదరుశర్మ దర్శకత్వంలో హెచ్.మహాదేవ్ గౌడ, హెచ్.నాగరత్నం నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి కొరియోగాఫ్రర్ చిన్నిప్రకాష్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ఎ.ఎం.రత్నం క్లాప్నిచ్చారు. చిత్ర నిర్మాత మహాదేవ గౌడ్ దర్శకుడికి స్క్రిప్ట్ అందజేయగా, ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు ఉదరుశర్మ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుత, ‘ఇదొక క్లీన్ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ‘ఈ చిత్రంలో నా పాత్ర పేరు సిరి. నాకు బాగా నచ్చిన పాత్ర. ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది’ అని నాయిక మేఘా ఆకాష్ అన్నారు. కథానాయకుడు రామ్కిరణ్ మాట్లాడుతూ, ‘ఈ చిత్రానికి కథే హీరో. అన్ని ఎమోషన్స్ ఉన్న చాలా శక్తివంతమైన కథ ఇది. ఈ చక్కని కుటుంబ కథా చిత్రం అందరికి నచ్చుతుంది’ అని తెలిపారు. ‘న్యూ కాన్సెప్ట్తో రూపొందుతున్న ఈ చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది.’ అని నిర్మాత అన్నారు.