నవీన్ చంద్ర, స్వాతిరెడ్డి, శ్రేయ నవిలే ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. యశ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని హ్యాండ్పిక్డ్ స్టోరీస్తో పాటు కషివ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్లో భాగంగా అచ్చు రాజమణి స్వరపరిచిన ‘ఓ నా మధు’ పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘ఈ పాట ప్రేమలోని అందమైన అనుభూతిని ప్రతిబింబించే ప్లజెంట్ మెలోడీగా ఉంది. పాటలోని రొమాంటిక్ ఫీల్ చాలా శ్రావ్యంగా ఉంది. ఈ పాటకు దర్శకుడు శ్రీకాంత్ నాగోతి స్వయంగా సాహిత్యం అందించగా, కార్తీక్, యామిని ఘంటసాల తమ మెస్మరైజింగ్ వాయిస్తో అద్భుతంగా అలపించారు. నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి వండర్ ఫుల్ కెమిస్ట్రీని పంచుకున్నారు. ఈ సినిమా అక్టోబర్ 6న విడుదల కానుంది’ అని చిత్ర బృందం తెలిపింది.