అంబేద్కర్‌ జయంతిని విజయవంతం చేయాలి

– ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎడ్లకాడి సూర్యం
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
ఈనెల 14న జరిగే అంబేద్కర్‌ జయంతిని విజయ వంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రాజేం ద్రనగర్‌ చౌరస్తాలో భారీ ఎత్తున అంబేద్కర్‌ జయంతిని నిర్వహిస్తున్నామని జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి ఎడ్లకాడి సూర్యం తెలి పారు. శుక్రవారం ఉప్పరపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. ఆదివారం జరిగే అంబేద్కర్‌ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, ఎంపీ రంజిత్‌ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరవుతున్నారని వారు స్పష్టం చేశారు. ఈ జయంతి ఉత్సవ కార్యక్రమంలో కళాకారుల సాంస్కృతిక కార్యక్ర మాలు అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటాయని వారు తెలిపారు. ఈ సమావేశంలో జయంతి ఉత్సవాల కమిటీ కోశాధికారి శ్రవణ్‌ కుమార్‌, జీవన్‌ దాస్‌, డేవిడ్‌, మహేష్‌, మహాత్మా, పంబాల రాజు, ప్రీతం తదితరులు పాల్గొన్నారు.

Spread the love