– ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా
నవతెలంగాణ – చైతన్యపురి
అన్ని దానాలలో కెల్ల అన్నదానం మిన్న అని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. ఆర్కే పురం డివిజన్ ఆర్యవైశ్య మహాసభ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో అమా వాస్య సందర్భంగా శ్రీకష్ణ మందిరం ఆవరణలో 500 మంది పేదలకు అన్నదాన ప్రసాదం, జీహెచ్ఎంసీ డివిజన్ పారిశుధ్య కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిం చారు. ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తాడేపల్లి వెంకటేశం గుప్త, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు చిలుక ఉపేం దర్ రెడ్డి లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వారు మాట్లా డుతూ సంఘం ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో డివి జన్ అధ్యక్షులు పొద్దుటూరు శ్రీనివాస్ గుప్త, ప్రధాన కార్య దర్శి శ్రీ నాగేంద్రయ్య, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బాలా శ్యామ్, అడ్వైజర్ శ్రవణ్ కుమార్ ఎన్టీఆర్ నగర్ ఆర్యవైశ్య సంఘం యూత్ అధ్యక్షులు వేణుగోపాల్, పెద్ది రాములు తదితరులు పాల్గొన్నారు.