– రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
నవతెలంగాణ-నాగోల్
చేనేత వస్త్రాలకు ప్రాధాన్యతనిచ్చి ధరించి చేనేత కార్మికులకు సామాజికంగా వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడి చేయూతనిద్దామని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మెన్, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జాతీయ కార్యనిర్వా హక అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస గుప్త పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులను సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని ఉద్దేశంతో తాను మూడు సంవత్సరాల నుండి చేనేత వస్త్రాలను ప్రతీ సోమ వారం ప్రత్యేకంగా ధరించి రాష్ట్రంలోని యువతకు, మేధావులకు అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలపై ప్రాధాన్యత ఇచ్చినట్టయితే రాష్ట్రంలోని చేనేత రంగం బలపడుతూ నేత కార్మికులకు సరైన ఉపాధి లభించి ఇతరులపై ఆధారపడకుండా వారు ఆర్థిక అభివద్ధి చెందుతూ జీవనోపాధి పొందుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే సోమవారం చేనేత వస్త్రాలను ధరించడం జరిగిందన్నారు.