నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌, ఆయన కుమారుడు జోగిరాజీవ్‌ సందర్శించారు. ప్రకతి సిద్ధమైన, స్వచ్ఛమైన నీరాను అందిస్తున్న కేఫ్‌ను జోగిరమేష్‌ ప్రశంసించారు. ఈ నీరా కేఫ్‌ను సందర్శించడానికి విచ్చేసిన మంత్రి జోగి రమేష్‌కు రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. నీరాకేఫ్‌లో లభ్యమవుతున్న ఉత్పత్తుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చలనచిత్ర నటుడు తల్వార్‌ సుమన్‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్య ప్రజా ప్రతినిధులు, నాయకులు, గౌడ సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Spread the love