బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైయస్సార్

నవతెలంగాణ-భిక్కనూర్
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. శనివారం మండల కేంద్రంలో రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఆయన అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, జిల్లా కార్యదర్శి లింబాద్రి, తదితరులు ఉన్నారు.
Spread the love