- Advertisement -
-విద్యుత్ భద్రత వారోత్సవాల్లో ఏడీఈ సుధీర్ బాబు
నవతెలంగాణ-బెజ్జంకి
వేసవి కాలం దృష్ట్యా విద్యుత్ వినియోగంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని ఏడీఈ సుధీర్ బాబు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని విద్యుత్ ఉప కేంద్రం కార్యాలయం వద్ద ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో అధికారులు విద్యుత్ భద్రత వారోత్సవాలు నిర్వహించారు. అనంతరం ఏడీఈ విద్యుత్ సిబ్బందికి రక్షణ పరికరాలను అందజేశారు. బెజ్జంకి, తోటపల్లి, కోహెడ, బస్వాపూర్ ఏఈలు మహేష్, అశోక్, రవీందర్, మనోజ్ కుమార్, వినియోగదారులు పాల్గొన్నారు.
- Advertisement -



