– మండిపోతున్న ఎండలు
– ఫలితం ఇవ్వని బడిబాట
– మొహం చాటేసిన విద్యార్ధులు
– 3276 మందికి 594 మంది హాజరు
నవతెలంగాణ – అశ్వారావుపేట
పాఠశాల విద్యాశాఖ జూన్ ఒకటి నుండే ఉపాధ్యాయులను బడిబాట పట్టించి నప్పటికీ పాఠశాలలు ప్రారంభం దినం అయిన సోమవారం విద్యార్ధులు మొహం చాటేశారు.దీనికి కారణం ప్రధానంగా మండిపోతున్న ఎండలు కాగా కొందరు విద్యార్ధులు ఇంకా బడి కి సిద్దం కాకపోవడం మరో కారణం అంటున్నారు విద్యావేత్తలు. అశ్వారావుపేట మండలంలో మొత్తం 92 పాఠశాలలు కు గాను 1 నుండి 10 వ తరగతి వరకు గతేడాది విద్యాసంవత్సరం పాఠశాల చివరి రోజు ప్రకారం 3276 మంది విద్యార్ధులకు మొదటి రోజు అయిన సోమవారం 594 మంది విద్యార్ధులు మాత్రమే హాజరు అయ్యారు.హాజరు శాతం 18.13 గా నమోదు అయింది.అధికారులు తెలిపిన ప్రకారం వివరాలు…
విద్యార్ధులు
తరగతి మొత్తం హాజరు
1 వ 120 60
2 వ 352 28
3 వ 302 98
4 వ 322 53
5 వ 372 156
6 వ 355 09
7 వ 325 25
8 వ 398 19
9 వ 324 55
10 వ 316 91
మొత్తం 3276 594