అద్వితీయ ఎంటర్టైనర్స్ బ్యానర్పై రాంభూపాల్ రెడ్డి నిర్మాతగా నర్సింగ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బ్రహ్మచారి’. ఏఎన్నార్, కమల్ హాసన్ లాంటి మహామహులు నటించిన ‘బ్రహ్మచారి’ టైటిల్తో వచ్చిన సినిమాలు బాగా సక్సెస్ అయినట్లే తెలంగాణ యాసలో వస్తున్న పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందింది. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసే మల్లేశం హీరోగా నటించిన ఈ చిత్రం ఈనెల 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించింది. ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర్శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర యూనిట్కు విషెస్ తెలియజేశారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకష్ణ గౌడ్, సీనియర్ డైరెక్టర్ చంద్ర మహేశ్ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
హీరో గుంట మల్లేశం మాట్లాడుతూ, ‘నేను ఒగ్గుకథ కళాకారుణ్ణి. అలాంటి నన్ను నర్సింగ్ ఆర్టిస్ట్ చేశాడు. ఇలాంటి మంచి కామెడీ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈనెల 10న విడుదలయ్యే ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇదొక శాంపిల్ మాత్రమే. మా సినిమా టీమ్ను ఆశీర్వదించాల్సిందిగా ప్రేక్షకులందరినీ కోరుతున్నా’ అని అన్నారు. ‘ఈ సినిమా తీయడానికి కథ చెప్పేటప్పుడు చాలా నేచురల్గా అనిపించింది. ఊళ్లో రచ్చబండ వద్ద మాట్లాడుకునేలా ఉంది. సినిమా తీశాక చాలా అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రాన్ని నాలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం. ఈ సినిమా మంచి హిట్ అయితే మరిన్ని సినిమాలు తీసే ప్రోత్సాహాం లభిస్తుంది. ప్రేక్షకులంతా ఈ సినిమాను హిట్ చేయాలని కోరుతున్నా’ అని నిర్మాత రాంభూపాల్ రెడ్డి చెప్పారు.