సర్‌ప్రైజ్‌ చేసే కంటెంట్‌ ఉంది

సర్‌ప్రైజ్‌ చేసే కంటెంట్‌ ఉందిసుహాస్‌ హీరోగా రూపొందిన యూనిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ప్రసన్న వదనం’. డైరెక్టర్‌ సుకుమార్‌ అసో సియేట్‌గా పని చేసిన అర్జున్‌ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్‌ మణికంఠ, టి ఆర్‌ ప్రసాద్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్‌ రాధాకష్ణ, రాశి సింగ్‌ హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ఈనెల 3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాత జెఎస్‌ మణికంఠ మీడియాతో ముచ్చటించారు.
”కలర్‌ ఫోటో, ఫ్యామిలీ డ్రామా’ చిత్రాలకు సహ నిర్మాతగా చేశాను. ఓ స్నేహితుడి ద్వారా ఈ కథ నా దగ్గరకి వచ్చింది. సుకుమార్‌ దగ్గర దర్శకుడు అర్జున్‌ పని చేశారు. తను చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. సుహాస్‌కి వినిపిస్తే ఆయనకి కూడా నచ్చింది. అలా ప్రాజెక్ట్‌ మొదలైంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా సినిమా చేశాం. నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. బిజినెస్‌ పరంగా లాభాల్లో ఉన్నాం. మైత్రీ, హౌంబలే లాంటి పెద్ద సంస్థలు ఈ సినిమాని విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఫేస్‌ బ్లైండ్‌ నెస్‌ కాన్సెప్ట్‌తో వస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్‌ ఇండియన్‌ సినిమాలో ఇప్పటికీ రాలేదు. ఇది అన్నీ వర్గాల ప్రేక్షకులని అలరించేలా ఉంది. చివరి వరకూ సర్‌ప్రైజ్‌ అయ్యే కంటెంట్‌ ఉంది. ఇలాంటి కాన్సెప్ట్‌ సినిమాలు ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తారు. మేం కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నాం. తమిళంలో ఓ పెద్ద సంస్థ నుంచి మంచి ఆఫర్‌ వచ్చింది. డబ్బింగ్‌ చేయాలా లేక రిమేక్‌ చేయాలా అనేది చర్చిస్తున్నాం. సుహాస్‌ తెలుగు పరిశ్రమకి అదష్టం. తనపై కొత్తకథలు వర్క్‌ అవుట్‌ అవుతున్నాయి. తను చాలా క్రమశిక్షణ గల నటుడు. నిర్మాతలకు, దర్శకులకు కంఫర్ట్బుల్‌గా ఉంటాడు. తనతో వర్క్‌ చేయడం చాలా మంచి అనుభవం. ఈ సినిమా తప్పకుండా మా అందరికీ మంచి సినిమా అవుతుంది’ అని తెలిపారు.

Spread the love